అనంతపురం నగరంలోని శారద నగర్ లో వివాహిత మరియు చిన్నారి అనుమానాస్పద మృతికి సంబంధించి అనంతపురం నగర డిఎస్పి శ్రీనివాసరావు గురువారం రాత్రి సమగ్ర విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగిరి డిప్యూటీ తహసిల్దార్ రవి నివాసంలో వివాహితతో పాటు మూడున్నర సంవత్సరాల చిన్నారి మృతి ఘటనకు సంబంధించి ఆయన పరిసరాలను నిశితంగా పరిశీలించారు. ప్రత్యేకంగా క్లూస్ టీం తో ఇంటి పరిసరాలను పరిశీలించారు.