ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన హత్య ఘటనపై సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. స్నేహితుడే 7000 గతంలో అప్పు తీసుకుని ఇవ్వలేదని హత్య చేసినట్లుగా నిర్ధారించారు. వెంకటరమణ ఇంటిలో ఇద్దరు కలిసి మద్యం సేవించి వెంకట రమణ నిద్రిస్తున్న సమయంలో ఏడుకొండలు గొడ్డలితో దాడి చేసి చంపాడని తర్వాత వెంకటరమణ చేతికి ఉన్న ఆరు గ్రాముల బంగారాన్ని నిందితుడు అపహరించినట్లు డీఎస్పీ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఏడుకొండలు హత్య చేసినప్పుడు డీఎస్పీ విచారణలో గుర్తించామన్నారు.