దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి:హుండీ ఆదాయం రూ.30,90,084
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపు బుధవారం నిర్వహించారు. అహోబిలం మఠం సీఓఓ సుందర రాజన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. హుండీల ద్వారా ఆలయానికి రూ.30,90,084 ఆదాయం లభించినట్లు మఠం అధికారులు తెలిపారు.