ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలో శివరాజ్ నగర్ నందు నియోజకవర్గంలోని క్రికెట్ క్రీడాకారుల కోసం సుమారు 5 ఎకరాలలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దర్శి ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో స్టేడియం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సమయానికల్లా స్టేడియం పూర్తి చేసేందుకు పనులు శర వేగంగా చేస్తున్నట్లు ఎమ్మార్వో తెలిపారు.