మద్దూరుకు మళ్ళీ వరద ఉదృతి
Machilipatnam South, Krishna | Sep 24, 2025
కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. కంకిపాడు మండలంలోని మద్దూరు, కెవి. పాలెంలోని నది పాయలో వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, 4.50 లక్షల క్యూసెక్కులకు ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.