కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో జనాబాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులసంఖ్యను వాహనాలను పెంచాలని, సుందరయ్య నగర్, జ్యోతిబాసు కాలనీ, ఐలమ్మ కాలనీల్లో పేదల నివాసాలకు డోర్ నంబర్లు వేయాలని, వీధి కుక్కలను నిరోదించాలని కోరుతూ బుధవారం రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (RDMA) బద్వేల్ మున్సిపల్ కార్యలయానికి వచ్చిన సందర్భంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో బద్వేల్ పట్టణ కార్యదర్శి శ్రీనువాసులు, జిల్లా కమిటీ సభ్యులు,ఛాందు బాషా, పట్టణ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.