రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాల్మీకిపురం మండలం మూరేవాండ్లపల్లి గ్రామంలో గురువారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 17వైద్య విద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేస్తున్న నేపథ్యంలో అందుకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మూరేవాండ్లపల్లి, మంచూరు, తాటిగుంటపల్లి గ్రామాల్లో చేపట్టినట్లు తెలిపారు