అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని విడపనకల్లు మండలం హవలిగి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడి పలువురికి గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హవలిగి నుంచి పాల్తూరుకు ఆటోలో ప్రయాణిస్తుండగా రైస్ మిల్ సమీపం లో ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.