కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు ప్రజాదరణ భారీగా పెరిగిందని ఏపీ కురుబ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నీలా స్వామి అన్నారు. కళ్యాణదుర్గంలో శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఆయన మాట్లాడారు. 72 శాతానికి ప్రజాదరణ పెరిగిందన్నారు. డీఎస్సీ కోచింగ్, మెగా జాబ్ మేళాలు, అవినీతి రహిత పాలన, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఉండడం, రహదారుల నిర్మాణం వంటి కారణాలవల్ల ప్రజాదరణ భారీగా పెరిగిందన్నారు. త్వరలోనే ప్రజాదరణ మరింత పెరుగుతుందని చెప్పారు.