రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సోమవారం ఫేస్ వాష్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో దూర ప్రాంతాల నుంచి మరో దూర ప్రాంతానికి వెళ్లే వాహనదారులను నిలిపి వారి మొహం కడుక్కునేలా చేసి వారికి జాగ్రత్తలు చెప్పే తిరిగి వారి గమ్యస్థానాలకు పోలీసులు పంపారు. నిద్ర వచ్చినట్లయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాలలో జాతీయ రాష్ట్రీయ రహదారులలో విశ్రాంతి తీసుకుని తిరిగి వారి గమ్యస్థానాలకు చేరాలన్నారు.