ఉప్పల్ విజయపురి కాలనీలో సాయి వికాస్ హై స్కూల్ స్పోర్ట్స్ మీట్ 2025 అట్టహాసంగా స్కూల్ కరస్పాండెంట్ జహంగీర్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ పాటవాలను వెలికి తీసి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. సాయి వికాస్ హై స్కూల్ కి చెందిన బాలురు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.