తాడిపత్రి: యాడికి లోని రాఘవేంద్ర కాలనీలో కంటి వైద్య శిబిరం, 100 మంది రోగులకు కంటి పరీక్షలు, ఉచితంగా అద్దాలు పంపిణీ
యాడికి మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో రిటైర్డ్ నేత్ర వైద్య నిపుణులు మధుసూదన్ రాజు ఆధ్వర్యంలో సోమవారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ స్పెషలిస్టులు 100 మంది రోగులను పరీక్షించారు. ఇందులో 80 మందికి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేత్రవైద్య నిపుణులు మధుసూదన్ రాజు మాట్లాడారు. జ్ఞానేంద్రియాలు నేత్రాలు చాలా ముఖ్యమైనవన్నారు. నేత్రాలను తరచూ పరీక్షించుకోవాలన్నారు. నేత్రాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.