జనార్దన్ రెడ్డి కాలనీతో పాటు వెంకటేశ్వరపురం కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకు అవసరమైన ప్రభుత్వ బ్యాంకును ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. జనావాసాలు ఉండే చోట ప్రభుత్వ బ్యాంకు లేకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ కి వారు వినతి పత్రం అందజేసి సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.