గిద్దలూరు: కొమరోలు మండల అభివృద్ధి కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చెన్నయ్య వెల్లడి
ప్రకాశం జిల్లా కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చెన్నయ్య ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలిపారు. ఎంపీపీ కామూరి అమూల్య అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ముఖ్యఅతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొంటున్నారని, అధికారులు తమ శాఖ నివేదికలతో హాజరుకావాలని పేర్కొన్నారు.