ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ శాఖ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హైమావతి మరియు 40 మంది అధికారులు 80 మంది విద్యుత్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 38 మంది గాను మొత్తం 2,41,600 అపరాధ రుసుము విధించినట్లు ఆమె పేర్కొన్నారు. మొదటిసారి కాంపౌండ్ పద్ధతి రుసుము అని రెండవసారి అరెస్టు చేస్తామని హెచ్చరించారు