జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా మీడియాకు ఆయన వివరాలను వెల్లడించారు. ప్రధాన సమస్య అయిన ఇంటి స్థలాలు అక్రిడేషన్ల అందించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.