రాయదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్డు రైల్వే గేటు వద్ద రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్ లు డీకొనడంతో ఇరువురూ కిందపడి గాయాలపాలయ్యారు. అటుగా వెళుతున్న కొందరు గమనించి ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒక వ్యక్తి పేరు బాలకృష్ణ కాగా మరో వ్యక్తి పేరు తెలియరాలేదు.