వికారాబాద్: జిల్లా కేంద్రంలో ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్ ప్రతిక్ జైన్
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ తీశారు. ఈవీఎంలు,బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.