ప్రకాశం జిల్లా పామూరు మండలం వగ్గంపల్లి లోని సహకార సంఘం పెట్రోల్ బంక్ ను బుధవారం ఎమ్మెల్యే ముక్కు.ఉగ్ర నరసింహ రెడ్డి తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, సహకార సంఘాల అభివృద్ధి తోనే రైతులు, మహిళల ఆర్థికాభివృద్ధి సాధ్యమన్నారు. సహకార సంఘాల ఆదాయం పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందనీ అన్నారు.