అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరిని కలిసి వేసింది. 14 సంవత్సరాల బాలిక అనారోగ్యానికి గురి కావడంతో డోలి సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.