శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరుపున కాణిపాకం ఆలయ చైర్మన్ మనీ నాయుడు,ఈవో పెంచల కిషోర్ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం అర్చకులకు చైర్మన్ మనీ నాయుడు,ఈవో పెంచల కిషోర్, శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాస రావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు,అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలు సమర్పించారు.