జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా మోటార్ వాహనాల తనిఖీ అధికారి వై విశ్వనాథ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో అవగాహనా సదస్సు నిర్వహించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకపోవడం వల్ల జరిగే అనర్ధాలు వివరించారు. ప్రమాదాలలో గాయపడ్డ కుటుంబాలు పడే ఇబ్బందులు తెలియజెసారు. జనవరి 31 వరకు వివిధ ప్రాంతాలలో భద్రతా అంశాల మీద అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.