యాడికి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో గురువారం క్రిస్మస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యాడికి మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో పాస్టర్ జయరాజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసు ప్రభువు జీవిత చరిత్ర గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఏసు ప్రభువును ప్రార్థించాలన్నారు. ఏసుప్రభువు పట్ల విశ్వాసం, భక్తి, నమ్మకం కలిగి ఉండాలన్నారు.