ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అనంతవరం గ్రామ సమీపంలోని నీటి కుంటలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పశువులను మేపేందుకు ఆలకూరపాడు గ్రామానికి చెందిన సుందరయ్య నీటి కుంట వైపు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి సుందరయ్య జాడ కనిపించలేదు. ఆదివారం మృతదేహం నీళ్ల పైన తేలడంతో మృతదేహాన్ని వెలికి తీసి బంధువులకు అప్పగించినట్లుగా స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు మీడియాకు ఆదివారం సాయంత్రం 6 గంటలకు తెలిపారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నమన్నారు.