నారాయణ్ఖేడ్: దామరగిద్ద గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ పండరి విధినిర్వహణలో మియాపూర్ లో గుండెపోటుతో మృతి
నారాయణఖేడ్ నియోజకవర్గం దామరగిద్ద గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ దార్కు పండరి (40) మంగళవారం గుండెపోటుతో మరణించారు. హైదరాబాదులోని మియాపూర్ 2 ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆయన, విధుల సమయంలోనే అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలారు. సహోద్యోగులు, గ్రామస్తులు పండరి మృతికి సంతాపం తెలిపారు.