మేడ్చల్: కుత్బుల్లాపూర్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు చింతల్ నగరశాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8200 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కన్వీనర్ మృత్యుంజయం మాట్లాడుతూ స్కాలర్షిప్లు విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వ వేసే బిక్ష కాదని అన్నారు.