జిల్లా జడ్జి అరుణ సారిక పర్యటన తిరుపతి జిల్లా సత్యవేడులో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక శనివారం సాయంత్రం పర్యటించారు. సత్యవేడులో నిర్మించనున్న నూతన కోర్టు భవన నిర్మాణానికి అనువైన స్థలం కోసం స్థల పరిశీలన చేసేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక శనివారం సత్యవేడులో పర్యటించారు. స్థానిక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వెంకట నారాయణ, తహసీల్దార్ రాజశేఖర్ స్వాగతం పలికారు. సత్యవేడులో ప్రస్తుతం నిర్వహిస్తున్న జూనియర్ సివిల్ కోర్టు భవనం పాతబడి, శిథిలావస్థకు చేరింది. దీంతో అధునాతన కోర్డు భవన సముదాయంను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా