నంద్యాల పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బొమ్మల సత్రం నుంచి ఆర్టీవో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక లోడుతో అధిక వేగంతో వెళ్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే అధికారులపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేశారు