ఈ నెల 10 వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదివారం సాయంత్రం 7గంటలకు ఒక ప్రకటనలో కోరారు. రాజీ పడదగిన కేసులలో,క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, డ్రంక్ & డ్రైవ్ కేసులు, మోటారు వాహన చట్టం ఉల్లంఘన కేసులు,వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు,బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవచ్చని తెలిపారు.