మార్కాపురం జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో జిల్లా ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక జిల్లా కోసం సుమారు 63 రోజుల పాటు ఉద్యమం చేశామని చివరికి నిరాహార దీక్షలు చేసినా తర్వాత అమరావతికి సైకిల్ యాత్ర ప్రారంభించినప్పుడు పోలీసుల అరెస్టు చేసి హాస్పటల్ కు తరలించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్నికలు వచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారన్నారు.