నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం మద్దిలేటిస్వామి క్షేత్రంలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో క్షేత్ర శుభ్రత, విద్యుత్ దీపాలంకరణ, పుష్ప అలంకరణలు చేస్తున్నారు. ఉత్తర ద్వారా దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.