పెరటి తోటల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసే విధంగా రైతులు ముందుకు వెళ్లాలని మండల వ్యవసాయ అధికారి షేక్షావలి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మహిళా మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ,వ్యవసాయ అనుబంధ శాఖలు,రైతు సాధికార సంస్థ, సెర్ప్ -వెలుగు సంస్థల సమన్వయంతో మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెలుగు ప్రాజెక్టు ఏపిఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రకృతి వ్యవసాయ అంశాన్ని అజెండాగా తీసుకుని చర్చించాలని చిన్న రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేయడమే కాకుండా ప్రతి