రాయచోటి పట్టణంలోని గాలివీడు రింగ్ రోడ్ వద్ద పాతరాయచోటి టీడీపీకి చెందిన పదిలం శివపై కత్తితో దాడి జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది.శెట్టివాండ్లపల్లిలో మట్టి తరలింపు విషయంలో పదిలం శివ మరియు మరోవ్యక్తి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం తీవ్రరూపం దాల్చి ఘర్షణకు దారి తీసినట్లు సమాచారం. ఈ ఘర్షణలో పదిలం శివ గాయపడటంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పదిలం శివను పరామర్శించేందుకు పలువురు టీడీపీ శ్రేణులు ఆసుపత్రికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.