మార్కాపురం జిల్లా కేంద్రంలో వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేశాడు. పట్టణంలోని కాలేజీ రోడ్డులో గల ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం మేరకు దాడి నిర్వహించినట్లు పఠన ఎస్సై సైదు బాబు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.