మార్కాపురం తర్లుపాడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో గురువారం పురాతన వీరభద్ర దేవాలయం ఆవరణలో ఉన్న నంది విగ్రహం ధ్వంసమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఈ ఘటనకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను పగలగొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ విగ్రహం ధ్వంసం కావడంతో జగన్నాధపురం,చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు, పోలీసులు జోక్యం చేసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.