జిల్లా వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరానా దొంగలను ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసులు శనివారం అదుపులోకి తీస్తున్నారు. గత నెల 23వ తేదీన గిద్దలూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు 10 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి చోరీకి పాల్పడ్డారు ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశంలో తెలిపారు. ఈజీ మనీ అలవాటు పడ్డ శివారెడ్డి, ప్రవీణ్, ప్రదీప్ అనే వ్యక్తులు దొంగతనాలు చేసేందుకు పూనుకున్నట్లు డీఎస్పీ నాగరాజు అన్నారు.