ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి పదిమందిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాలు నడుపుతున్న వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని పోలీసు అధికారులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు.