మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేట్ సమీపంలో బాల అంకయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బాధితుడు బాలంకయ్య మంగళవారం ఆరోపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన సంఘటనపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు.