కొండపి: ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో పేలుళ్లు జరిగిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బస్టాండ్లు రైల్వే స్టేషన్ లతో పాటు అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తతో అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతోపాటు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ముందస్తు జాగ్రత లు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.