అనంతపురం జిల్లా చెదుళ్ల గ్రామంలో దంపతులపై దాడి, గాయపడిన వారిని అనంతపురం ఆసుపత్రికి తరలింపు
Anantapur Urban, Anantapur | Sep 14, 2025
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం కొత్తచెడుల గ్రామంలో దంపతులు నాగరాజు నాగేంద్రమ్మ పై వారి సమీప బంధువులు రాళ్లతో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో చిన్నపాటి ఘర్షణకు సంబంధించి ఒక్కసారిగా తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.