రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యర్రగుంట్లపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పిఎసి మెంబర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టారు.పీలేరు నియోజకవర్గంలోని పీలేరు మండలంలోని యర్రగుంట్ల పల్లి,కాకుళారం పల్లి,వేపులబైలు గ్రామాల నందు కోటి సంతకాల కార్యక్రమాన్ని పిఎసి మెంబర్,మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నిర్వహించి ఈ సందర్భంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో వివరించారు.