ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో డిఆర్సి సమావేశం, హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన డిఆర్సి సమావేశం ఆసక్తికరంగా సాగింది. సమావేశానికి ప్రకాశం జిల్లా ఇన్ ఛార్జ్ ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి సమావేశానికి హాజరై జిల్లా అభివృద్ధిపై చర్చించారు. పలు అంశాలపై స్థానిక ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులు కార్పొరేషన్ చైర్మన్ లతో కలెక్టర్ రాజాబాబు చర్చించారు. సమావేశం మధ్యాహ్నం నాలుగు గంటలకు జరిగింది.