ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో శనివారం మౌజనులు ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మౌజనులకు వేతనాలు విడుదల చేస్తూ రూ.90 కోట్లు నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుకు మౌజనులు కృతజ్ఞతలు తెలిపారు. పాలాభిషేకం అనంతరం సీఎం చంద్రబాబుకు జై అంటూ వారు నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబు తమ కష్టాలు గుర్తించి తమ వేతన బకాయిలు విడుదల చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మౌజనులు అన్నారు.