ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేకుండా చెట్లను నరికి ట్రాన్స్పోర్ట్ చేయకూడదని ఖేడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనురాధ అన్నారు. నారాయణఖేడ్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. అడవులలో అడవి పందులు తిరుగుతున్నాయని కరెంట్ షాట్ పెట్టకూడదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమకు తెలపాలని పేర్కొన్నారు. అడవులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చట్టాలపై ప్రత్యేక అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. ఫారెస్ట్ను కాపాడే తమపై తిరిగి కేసులు చేస్తున్నారని అన్నారు.