అన్నోజిగూడలో నూతనంగా నిర్మించిన సంత సేవాలాల్ మహారాజు దేవాలయంలో విగ్రహ ప్రతిష్టోత్సవాలు కండ్ల పండుగ ప్రారంభమయ్యాయి. శనివారం గణపతి పూజ, అఖండ దీపా స్థాపన, అగ్ని ప్రతిష్టాపన వంటి శాస్త్ర క్రతువులు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాత్రి స్వామి వారి విగ్రహాన్ని డప్పు చప్పుల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహిళలు హారతులతో పాల్గొని భక్త పరవశ్య వాతావరణంలో సృష్టించారు. ఉత్సవాలు సోమవారం వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.