రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయాన్ని కర్నూలు జిల్లా అడిషనల్ జిల్లా జడ్జి వాసు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆయన కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గాజుల వెంకటేశులు, ఈఓ నరసింహరెడ్డి, అర్చకులు బాలమురళీ కృష్ణ బట్టార్ లు స్వాగతం పలికారు. స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీస్సులు అందజేశారు. ఆలయ విశేషాలను జడ్జి అడిగి తెలుసుకున్నారు.