పాన్గల్: స్వరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వనపర్తిలో మంత్రి మాట్లాడుతూ.. సొరంగంలో చిక్కుకున్న వారిని బయట తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నామని, పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, బీఆర్ఎస్ నేతలు శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.