ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ASF జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి దరఖాస్తుదారుల నుండి 20 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, గత ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల సంబంధిత వివరాలు అందించాలని తెలిపారు.