వైసీపీ నేతలను కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. మనుబోలు మండలం కొండూరు సత్రంలో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలోనే ఉంటూ తమకు పని చేయని వారిని గుర్తు పెట్టుకుంటామని కాకాని అన్నారు. పార్టీని వీడి టిడిపిలో చేరిన వారిని భవిష్యత్తులో తిరిగి వైసీపీలోకి తీసుకోమని స్పష్టం చేశారు.