అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని సంజీవపురం గ్రామానికి చెందిన నాగముని అనే వ్యక్తిపై వేటకొడవల్లతో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.